ఇబ్రహీంపట్నం లో మెరిసిన వెటరన్ క్రికెటర్లు

గత మూడు రోజుల నుండి ఘనంగా ముగిసిన         దవెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీ
పాల్గొన్న ఆరు జట్లు విజేతగా విజయవాడ
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) :- ఇబ్రహీంపట్నం మండలం లోని బొంగుళూరు గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నం సమీపంలోని బోంగ్లురు లోని బిగ్ బ్యాట్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించిన ద వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు ఆరు జట్లు అట్మస్ట్ కో, డెక్కన్ హాస్పిటల్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో తలపడ్డాయి. విజయవాడ, హైదరాబాద్ జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. ఫైనల్ లో విజయవాడ జట్టు హైదరాబాద్ జట్టు పై 9 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో ఆంధ్ర రంజీ టీమ్ ప్లేయర్ లెనిన్, ప్రసన్న కుమార్, మాజీ రంజీ క్రికెటర్ ఆర్య స్వరూప్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రజినీకాంత్, వినోద్ కుమార్, నితీష్ రెడ్డి, గోవింద్ రాజు, కమిటీ ప్రధాన కార్యదర్శి సురేష్ రాజన్, ఆనంద్ కామత్ తదితరులు పాల్గొన్నారు