ఇళ్ల పైన 33 కెవి కరెంటు లైన్లు

శ్రీరంగాపురం: అక్టోబర్ 17 (జనంసాక్షి):
శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామం లో కరెంట్ వైర్లు ఇండ్లపై నుంచి ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో 33 కెవి కరెంటు లైన్లు ఇండ్ల పైనే వైర్లు పోవడంతో గ్రామస్తులు భయాందోళనలో గురవుతున్నారు దాదాపు 200 కుటుంబాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు దరఖాస్తు ఇచ్చిన పట్టించుకోవడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు ఇండ్లపైన వైర్లు తీసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు యాదవ్ బోయ కురుమన్న ఎల్ల స్వామి వెంకటయ్య బాలకృష్ణ బోయ శివ బోయ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.