ఇవాళా, రేపూ డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేక విమానాలు చంద్రబాబు

డెహ్రాడూన్‌: ఈరోజు సాయంత్రం 130 మంది యాత్రికులతో ప్రత్యేక విమానం డెహ్రాడూన్‌ నుంచి బయల్దేరుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 250 మంది తెలుగు యాత్రికులు కాలినడకన జోషిమఠ్‌ బయలుదేరారని అయన చెప్పారు. తెలుగు యాత్రికులు జోషిమఠ్‌ నుంచి రేపు సాయంత్రం డెహ్రాడూన్‌ చేరుకునే అవకాశం ఉందని, రేపు కూడా డెహ్రాడూన్‌ నుంచి యాత్రికులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తరలిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.