ఈత ట్యాంపరింగ్ టెస్టు లో జంగంపేట నిర్మల

తూప్రాన్, జనం సాక్షి సెప్టెంబర్, 22::తూప్రాన్ గౌడ సంఘం సభ్యురాలు శ్రీమతి జంగంపేట్ నిర్మల నాగరాజు గౌడ్ బుదవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ట్యాపరింగ్ టెస్ట్ లో పాల్గొని లైసెన్స్ కు అర్హత సంపాదించినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ మహమ్మద్ రజాక్ పేర్కొన్నారు జంగం పేట్ నిర్మల మోకు, ముస్తాక్ నడుముకు, కట్టుకొని ఓ చేతిలో కోల పై నేరుసు వేసి ఉలి, చేవుటులి నూరి ఈత చెట్టు ఎక్కి కల్లు గీసి పలువురి చే శభాష్ అనిపించుకుంది జంగం పేట్ నిర్మల ఆమె భర్త నాగరాజు గౌడ్ సైతం స్వతహాగా గీతా కార్మికుడిగా అర్హత సంపాదించి లైసెన్స్ పొందాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కల్లు గీత కార్మికులు కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ తన చిన్న తనంలోనే తండ్రి గారి అలనా పాలన లో తండ్రి కల్లు గీత కు వెళితే వెంట ఉండి శిక్షణ పొందినట్లు వివరించారు.