ఈ నెల16న జరిగే కవి సమ్మేళనంను సద్వినియోగం చేసుకోవాలి.

14వ తేది లోపు తమ కవిత్వ ప్రతిని డిపిఆర్వో కార్యాలయంలో అందజేయాలి.
జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం.
 నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు12 (జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా  ఆగష్టు 16వ తేదీన నాగర్ కర్నూల్  జిల్లా సహకార సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే కవి సమ్మేళనం శీర్షిక ” స్వాతంత్ర్య స్ఫూర్తి – వజ్రోత్స దీప్తి”  16వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించబడునని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో పాల్గొనదలచిన జిల్లా కవులు కళాకారులు  తమ కవిత్వాన్ని ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ కవిత్వ ప్రతిని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని  కోరారు.  జిల్లా  లోని కవులు కళాకారులు ఈ వజ్రోత్సవ వేడుకల సందర్బంగా నిర్వహించే కవి సమ్మేళనం కార్యక్రమాన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  మరింత సమాచారం కొరకు డి.పి.ఆర్.ఓ సిబ్బంది పాషా మొబాయిల్ నెంబర్ 9618629037 కు సంప్రదించాలని తెలియజేసారు.