ఈ నెల16న జరిగే కవి సమ్మేళనంను సద్వినియోగం చేసుకోవాలి.
14వ తేది లోపు తమ కవిత్వ ప్రతిని డిపిఆర్వో కార్యాలయంలో అందజేయాలి.
జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు12 (జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగష్టు 16వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా సహకార సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే కవి సమ్మేళనం శీర్షిక ” స్వాతంత్ర్య స్ఫూర్తి – వజ్రోత్స దీప్తి” 16వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించబడునని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో పాల్గొనదలచిన జిల్లా కవులు కళాకారులు తమ కవిత్వాన్ని ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ కవిత్వ ప్రతిని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. జిల్లా లోని కవులు కళాకారులు ఈ వజ్రోత్సవ వేడుకల సందర్బంగా నిర్వహించే కవి సమ్మేళనం కార్యక్రమాన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కొరకు డి.పి.ఆర్.ఓ సిబ్బంది పాషా మొబాయిల్ నెంబర్ 9618629037 కు సంప్రదించాలని తెలియజేసారు.