హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

హైదరాబాద్‌లో డీ జేల వినియోగంపై నిషేధం విధించే దిశగా ప్ర భుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఫిర్యాదుల నేపథ్యంలో మతపరమైన ర్యాలీల్లో డీజేలు, పటాకుల వాడకంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అధ్యక్షతన బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో డీజేలు, పటాకుల వినియోగం తగ్గించేలా చర్యలు చేపడతామని చెప్పారు.