తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనికితోడు ఆపరేషన్‌ మూసీ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్‌ చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో శనివారం ఉదయం హైడ్రా బాధితులు ఒక్కొక్కరిగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.