సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హెచ్‌సిఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. సచివాలయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.