ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది.

 

 

 

 

 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉక్రెయిన్‌ను  మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు.. రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద, ఖార్కివ్‌లలో పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయని బీఎన్‌ఓ న్యూస్‌ తెలిపింది. అదేవిధంగా డెనెట్స్క్‌ ప్రావిన్స్‌లోని యరియుపోల్‌పై శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది.ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆ దేశంలోని ప్రధాన నగరాలపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. కాగా, రష్యా చర్యలతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం అప్రమత్తమయింది. అప్పటికే దేశంలో ఎమర్జెనీ విధించిన సర్కార్‌ ఎయిర్‌ స్పేస్‌ను మూసివేసింది.తమను తాము రక్షించుకుని విజయం సాధిస్తామని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న తమ దేశంలో పుతిన్‌ అలజడి సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.