ఉక్రెయిన్‌ నుంచి కొనసాగుతున్న తరలింపు

మరో ఐదు విమానాల్లో ఢల్లీికి విద్యార్థులు
స్వాగతం పలికి ధైర్యం నింపిన కేంద్రమంత్రి స్మృతి
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు పక్రియను కేంద్రం ముమ్మరం చేసింది. ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో భారతీయులు, పౌరులను తరలించారు. బుధవారం మరో ఐదు ప్రత్యేక విమానాల్లో ఢల్లీి ఎయిర్‌ పోర్టుకు వచ్చారు. ఉదయం ఇస్తాంబుల్‌ నుంచి 220 మంది ఢల్లీికి వచ్చారు. ఎయిర్‌ పోర్టులో విద్యార్థులకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ స్వాగతం పలికారు. పోలాండ్‌ నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ఢల్లీికి భారతీయులు వచ్చారు. పోలాండ్‌ నుంచి వచ్చిన విద్యార్థులకు…. ఎయిర్‌ పోర్టులో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ లోని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా…ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులు అక్కడున్న భారతీయ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈనెల 8 వరకు మొత్తం 50 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేలా ప్లాన్‌ చేస్తుంది కేంద్రం. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలు పంపుతుంది. బుడాపెస్ట్‌ కు 10, బుకారెస్టుకు 29, పోలాండ్‌ కు 10 ప్రత్యేక విమానాలు నడపనుంది కేంద్రం. ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన 2 సీ` 17 విమానాలు రోమేనియా, హంగేరీలకు వెళ్లాయి. ఉత్తరప్రదేశ్‌ గాజియాబాద్‌ లోని హిందాన్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి 2 ఎయిర్‌ ఫోర్స్‌ ఎయిర్‌ క్రాప్ట్స్‌ బయల్దేరి వెళ్లినట్లు తెలిపారు అధికారులు. ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం నిత్యావసర సరకులు, దుప్పట్లు, మెడిసిన్‌ తీసుకొని వెళ్లింది సీ`17 విమానం. మంత్రి స్మృతి స్టూడెంట్స్‌తో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. బాంబుల మోతతో ఉక్రెయిన్‌ దద్దరిల్లుతున్నా..ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.విూ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని..విూ రాకతో వారి కళ్లల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. స్వదేశానికి తిరిగి రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ గంగా ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.