ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణవార్త విని భార్య ఆత్మహత్య

బాంకురా: ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణించిన వార్త విన్న అతని భార్య కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపాయి అద్వైత నందికి పియూతో పెళ్ల్ల్తె ఏడాదిన్నరే అయింది. 29 ఏళ్ల అద్వైత సోమవారం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. ఆ వార్త తమకు చేరినప్పటి నుంచి 20 ఏళ్ల పియుని కంటికి రెప్పలా కాపాడుతున్నామని అలాంటి తమ కన్నుగప్పి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని అద్వైత తండ్రి తెలిపారు. కొడుకు, కోడళ్లిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది. అద్వైత సోదరుడు కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు.