ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రాహుల్‌

ఇండోర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. సోమవారం ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు. జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరుడికి రాహుల్‌ పూజలు చేశారు.

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఆలయాలకు వెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆ రాష్ట్రంలోనే ఉన్న మా పీతాంబేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ మహాకాలేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్ర తీవ్ర స్థాయిలో రాహుల్‌పై కామెంట్‌ చేశారు. రాహుల్‌ .. నువ్వు జెంజం వేసుకుంటావా, ఒకవేళ నువ్వు జెంజం వేసుకుంటే, అది ఎలాంటిది. నీ గోత్రం ఏంటిదని బీజేపీ ప్రతినిధి ప్రశ్నించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాహుల్‌ సోమ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. తాను శివ భక్తుడిని అని కూడా గతంలో రాహుల్‌ చెప్పుకున్నారు.