ఉత్తర తెలంగాణకు మళ్లీ మావోయిస్టులు

3

కేకేడబ్ల్యు కమిటీ పునరుద్ధరణ

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్‌కు బాధ్యతలు

విజయవంతంగా ప్లీనరీ

అప్రమత్తమైన పోలీసులు

వరంగల్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి):  తెలంగాణ ప్రాంతంలో  గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టుల కదలికలు మళ్ళీ మొదలు అయ్యాయా?  అంటే కొన్ని రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో మావోయిస్టు ప్లీనరి జరగడంతో ఈ అనూమానలకు బలంచేకురుతుంది. ఈ ప్లీనరీలో  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను యాప నారాయణ ఆలియాస్‌ హరిభూషణ్‌ కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ జిల్లాలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టు కార్యకలాపాలకు కంచుకోటగా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో కొద్ది రోజులగా అన్నల కదిలికలు క్రమంగా  తగ్గుతూవచ్చాయి.  మావోయిస్టులకు పట్టున్న తెలంగాణ ప్రాంతంలో ….ఉత్తర తెలంగాణ పాత్ర మరువ లేనిది.  ఉద్యమ సమయంలో కూడా అంతగా పట్టులేని వారు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో మళ్లీ తమ కదలికలను మొదుల పెట్టారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్లీనరీ జరగడం,ప్లీనరీలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా హాజరుకావడం…. హరిభూషణ్‌ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడంతో మళ్లీ మావోల కదలికలు మొదలయ్యాని సర్వత్రా చర్చ జరుగుతుంది. మావోల ప్లీనరీ తో వరంగల్‌ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.  మావోలకు పట్టున్న ప్రాంతాలను జల్లెడ పడుతూ….ఇన్‌ ఫార్మర్‌ వ్యవస్ధను తిరిగి పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు..మరో పక్క అడవులలో కూబింగ్‌ నిర్వహిస్తూ అడవుల్లో నక్సల్స్‌ కదలికలపై గాలింపులను ముమ్మరం చేశారు. మావోల ప్లీనరీ ని పోలీసులు  మాత్రం సీరియస్‌ గానే తీసుకోని అప్రమత్త మాయ్యారు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మావోల ఏజెండానే  తమ పార్టీ  ఎజెండా అని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది. వరంగల్‌ లో కొద్ది రోజుల క్రితం ఆర్థిక మంత్రి  ఈటెల.రాజెందర్‌ సైతం మావోల ఎజెండానే ప్రభుత్వ ఎజెండా అని చెప్పిన కొద్ది నెలలకే మావోల ప్లీనరీ జరగడంతో మావోలకు పాత రోజులు వచ్చాయనే  అనే గుసగుసలు వినవస్తున్నాయి. ఉత్తర తెలంగాణ కేంద్రంగా నక్సల్బరీ ఉద్యమం ఊపందుకోవడంతో పోలీసుల నిర్భందం పెంచారు. దాంతో మావోయిస్టులు ఆజ్ఞాతానికే పరిమతమయ్యారు. అంతేకాకుండా మావోయిస్టుల కదలికలపై పకడ్బంది నిఘా పెట్టిన పోలీసులు ఇన్‌ ఫార్మర్‌  వ్యవస్థను పటిష్టం చేసుకొని మావోల ఆగ్రనేతలను  మట్టుబెట్టారు. వీటితో పాటు మరో పక్కా  మావోయిస్టు లొంగుబాట్లను సైతం ప్రోత్సహించారు. దీంతో మావోయిస్టులకు సేఫ్‌ జోన్‌ అయిన ఉత్తర తెలంగాణ నుండి మావోలు పక్క రాష్ట్రమైన చత్తీస్‌ ఘడ్‌ తో పాటు  ఒరిస్సా, జార్ఖాండ్‌, పశ్చిమ బెంగాల్‌ , మధ్య ప్రదేశ్‌ లకు షెల్టర్‌ లు  మార్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా సద్దుమనిగాయి. తమ ఉనికి కోసం … అడపదడప కరపత్రాలను విడుదల చేస్తూ ప్రజావ్యతిరేకార్యకలపాలు, భూకబ్జాలకు పాల్పడిన వారిని ప్రజాక్షేత్రం లో శిక్ష తప్పదనే హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అయితే కేవలం హెచ్చరికలు…. కరపత్రాలు విడుదలకే పరిమతమైన మావోలు మళ్లీ తెలంగాణ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహరచన చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడంతో మావోలు తమ కార్యకలాపాలకు మళ్ళీ  శ్రీకారం చుట్టారు.

కొద్ది రోజుల క్రితం ఉత్తర తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలో మావోయిస్టు ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీకి మావోయిస్టు అగ్రనేతలంతా హజరయ్యారు. పార్టీ కార్యకలాపాలు, బలాలు, బలహీనతలు, తెలంగాణలో పూర్వవైభవం తేవడంకోసం చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది నెలలు అయిన  పార్టీ  బాధ్యతలను ఎవరికి అప్పగించకుండా అగ్రనేతలే చూస్తువచ్చారు. ఈప్లీనరీలో తెలంగాణ కార్యదర్శి బాధ్యతలను యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ కు అప్పగించింది.. వరంగల్‌ జిల్లా ఖానాపూరం చెందిన హరి భూషన్‌ …గతంలో  ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీ బాధ్యతలు చూశారు. అందరిని ఏకతాటిపై నడిపించడం, వ్యూహాలు రచించడంలో హరిభూషణ్‌ దిట్ట అన్న పేరుంది..  హరిభూషణ్‌ నియామకంతో తెలంగాణలో మావోల కదలికలు మళ్లీ మొదలయ్యాయననే  చెప్పవచ్చు. ఇప్పడి కిప్పుడు నాయకత్వం మంతా ఇతర రాష్టాల్ర నుండి వచ్చి తెలంగాణ షెల్టర్లను ఏర్పాటు చేసుకోలేక పోయిన కార్యకలపాలను కొనసాగించడం కోసం పార్టికి సంబందించిన రిక్రూట్‌మెంట్‌లను చేస్తూ పార్టి బలోపేతం చేసే దిశగా మావోల కదలికలు ఉంటాయని పోలీసు నిఘా వర్గాలు అంచనా వేసి పోలీసులను అప్రమత్తంగా ఉండమని …ఇప్పటికే హెచ్చరికలు చేసినట్టు సమాచారముంది. దాంతో  ఉత్తర తెలంగాణ ప్రాంత అడవులు,ఎజేన్సీ ప్రాంత గిరిజనులతో సంబందలు ఉన్నా హరిభూషణ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించారని ఇంటలిజెన్స్‌ అదికారులు అంచనా వేస్తున్నారు.ఈయన నియామకంతో ఉత్తర తెలంగాణలో మావోల కదలికలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అయితే ఏది ఎమైనా కొత్త రాష్ట్రంలో మావోల ప్లీనరీ జరగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మావోలకు పాతరోజులు వచ్చిన…. పోలీసుల నిర్బంధం పెరుగుతుందే తప్ప …నక్సల్స్‌ కార్యకలాపాలను చూస్తు సహించే అవకాశాలు  కన్పించడం లేదు. ఒక వేళ మావోలకు అనుకూలమైన రోజులే అనుకుంటే ఇప్పడికిప్పుడు గతంలో లాగ పార్టీ ని విస్తరించే. కార్యక్రమాలు నిర్వహించడం కష్టమనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఓక్కసారిగా ఇటు మావోలు అటు పోలిసులు అడవులను జల్లెడ పడుతుంటే అమాయక గిరిజనల్లో అలజడి మొదలయ్యింది.గత కోంత కాలం నుండి  బిక్కుబిక్కుమాంటు జీవించే పరిస్ధితులు  కోనసాగుతున్నాయి.  ,,, సో… తెలంగాణ రాష్ట్రంలో  ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.