ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం: కోదండరాం
కరీంనగర్: ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మణ్: ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ మార్చ్ కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు ఎరువులు, విద్యుత్కోతలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.