ఉద్యోగ,ఉపాధ్యాయులకు డిఏ ను తక్షణమే విడుదల చేయాలి.

టిపిటియూ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్2(జనంసాక్షి):
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యగ,ఉపాధ్యాయులకు రావలసిన మూడు డిఏ లను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు కూడ నెల వారిగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పీఆర్సీ బకాయి లను కూడా సక్రమంగా ఇవ్వాలని సాయి రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.దసరా,దీపావళి రెండు పండుగలు ఒకే నెలలో ఉన్నందున వేతనాలుకూడ తొందరగా ఇవ్వాలని అన్నారు. స్కూల్ గ్రాంట్ లు పాఠ శాలలు తెరిచే వరకు దసరా సెలవులు లోపే విడుదల చేయాలన్నారు.