ఉద్యోగులను బ్లాక్‌ మెయిల్‌ చేసిన సిఎం

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శలు
అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని సీఎం జగన్‌ మాట్లాడటం దిగజారుడు తనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ జగన్‌ ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల నాయకుల్ని బ్లాక్‌ మెయిల్‌ చేసి ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. నాయకులు స్వార్దం కోసం ఉద్యోగస్తుల్ని మోసం చేయబట్టే.. ఆ జేఏసీల్లో నుంచి ఉద్యోగులంతా బయటకొచ్చి కొత్త జేఏసీలతో ఉద్యమానికి సిద్దమవుతున్నారన్నారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చమంటే.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదనటం పచ్చి అబద్దమన్నారు. 2021 డిసెంబర్‌ నాటికే రూ. 97 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మార్చి నాటికి రూ. 1 లక్షా 32 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదన్నారు. నాడు, నేడు, వైసీపీ రంగులు, ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని, ఈ అవినీతి లేకపోతే 30 శాతం పీఆర్సీ ఇవ్వొచ్చునన్నారు. జగన్‌ ఉద్యోగులకు చేసిన మోసానికి వాళ్లు రిటర్న్‌ గిప్ట్‌ ఇవ్వటం ఖాయమన్నారు.? ఉద్యోగుల న్యాయబద్ద పోరాటానికి టీడీపీ అండగా ఉటుందని అశోక్‌ బాబు స్పష్టం చేశారు.