ఉన్నత లక్ష్యాలను సాధించుటకు నిరంతర కృషి చేయాలి -జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి సులోచన రాణి

ఉన్నత లక్ష్యాలను సాధించుటకు నిరంతర కృషి చేయాలి -జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి సులోచన రాణి

టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించుటకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని సులోచన రాణి సూచించారు. బుధవారం టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యా సంబంధిత రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణను అలవర్చు కోవాలని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించుటకు నిరంతరం కృషి చేయాలని కోరారు. విద్యార్థులతో కలిసి వార్షిక ప్రణాళిక అమలు అయ్యే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ కల్పన సీనియర్ ఆధ్యాపకులు జయ శ్రీ , కృష్ణమూర్తి, బసవమ్మ, సత్యవతి, ముంతాజ్ అలీ, శంకరరావు, వేణుగోపాల్, శ్రీనివాస రావు, యాకూబ్, వరలక్ష్మి, ప్రమోద్ కుమార్, నాగేశ్వరరావు, చైతన్య పాల్గొన్నారు.