ఉపాద్యాయుల సర్వీస్ రిజిస్టర్ లు పరిశీలన చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కొక్కొండ రజిని

మండల కేంద్రము లోని ఎం ఆర్ సి కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నారావుపేట కాంప్లెక్స్ పరిధిలోని ప్రాధమిక పాఠశాలల ఉపాద్యాయుల సర్వీస్ రిజిస్టర్ లను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కొక్కొండ రజిని పరిశీలించారు. ఉపాద్యాయులు ఇది వరకు వారి సర్వీస్ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ లో నమోదు చేసిన వివరాలు సర్వీస్ బుక్ లో ఉన్న వివరాలను సరి చూడడం జరుగుతుంది. ఎలాంటి తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఉపాద్యాయులు కు తగు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు
ఈదునూరి రవీందర్ రెడ్డి,పోలేపల్లి రవి,చల్లా తిరుపతి రెడ్డి,నాంపేల్లి విజేందర్,మహమ్మద్ రియాజుద్దీన్, మహమ్మద్ అజాం,మంచాల రమేష్,వేద ప్రకాష్, బ్రహ్మచారి, హరి, ఎం ఆర్ సి సిబ్బంది అశోక్,స్వప్న,యాదగిరి, సీఆర్పీ సంపత్ పాల్గొన్నారు.