ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

కడప,జూలై13(జనంసాక్షి): ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేయాలని రాయలసీమ ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. గతంలో టిడిపి హావిూ ఇచ్చిన అనేక హావిూలు వి ఇప్పటికీ అమలుకు నోచుకోని హావిూలు ఉన్నాయనీ చిత్తశుద్ధితో వాటిని నెరవేర్చా లన్నారు. ఒప్పంద అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ హావిూ పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక ఉపాధ్యాయుల నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌ గురించి పట్టించుకోవాలన్నారు. పండిట్‌, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. నెలసరి ప్రీమియం చెల్లించినా ఆరోగ్యకార్డులు అమలు కాలేదన్నారు. ఆదర్శ పాఠశాలలకు పదో పీఆర్సీ ఇవ్వలేదన్నారు.