ఉప్పరి గూడ గెట్ వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి పెద్ద ఎత్తున  అలుగు దూకడం వలన సాగర్ హైవే నుండి ఉప్పరిగూడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడం వలన  ఇబ్రహీంపట్నం మరియు  హైదరాబాద్ వెళ్లడానికి   గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఇబ్రహీంపట్నం తెరాస మాజీ మండల అధ్యక్షులు బోసుపల్లి వీరేశ్ కుమార్ అన్నారు. ఉప్పరిగూడ గేటు వద్ద రాకపోకలకు వీలుగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని సోమవారం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు కి  వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మడుపు వెంకటేష్ , ఓరుగంటి రాములు , బుట్టి మహేందర్ ముదిరాజ్ , కొంగరి శ్రీకాంత్ , నరాల జంగయ్య , నర్కుడి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు