*ఉమ్మడి మండలానికి నేడు వ్యవసాయ శాఖ మంత్రి రాక*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (25):* మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మరియు రేవల్లి మండల కేంద్రంలో కామన్ కమ్యూనిటీ హాల్ భూమి పూజ, బండరాయిపాకుల గ్రామపంచాయతీ భవనం ప్రారంభం, కొంకలపల్లి గ్రామంలో ప్లాట్ల పంపిణీ కార్యక్రమాలకు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రానున్నట్లు టిఆర్ఎస్ గోపాల్ పేట్, రేవల్లి, మండలాల అధ్యక్షులు కోదండం, రఘు రామారావు లు ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. కావున ఉమ్మడి మండలాల ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు, సకాలంలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు