ఎంపీడీఓ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి

ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి) వీరవనిత చాకలి ఐల్లమ్మ జన్మదిన సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ డీసీసీ డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తానీ ఎంపీపీ అధ్యక్షులు దేవదాస్ ఉపాధ్యక్షుడు మల్లన్న పాటిల్ ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ శంకర్ పాటిల్ రజక సంఘo సీనియర్ నాయకులు దత్తు సంఘ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.