ఎంపీ ఇంటిపై దాడిని నిరసిస్తూ మండలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

 .నందిపేట్ (జనం సాక్షి )నవంబర్ 18 .నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి గారి ఇంటిపై టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడం నిరసిస్తూ మండల కేంద్రంలో ప్రభుత్వం,మరియు టిఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు శ్రీ భూతం సాయి రెడ్డి గారు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీ గడ్డం చిన్నారెడ్డి గారు సీనియర్ నాయకులు శ్రీ గంగాధర్ గౌడ్ గారు జిల్లా నాయకులు పోతుగంటి సురేందర్ , జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అన్నారం ఎంపీటీసీ అట్టోలి సంజీవ్ , కొత్తూరు ప్రవీణ్ , కంఠం సాయి , బీజేవైఎం జిల్లా నాయకులు నాగ సురేష్ గారు మరియు మండల నాయకులు పాల్గొనడం జరిగింది.