ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదానం
తిరుపతి, జనవరి18(జనంసాక్షి) : నందమూరి తారక రామారావు 23 వ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణంలో మార్కెట్ కమిటీ వద్ద నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ ఆర్వి.సుభాష్ చంద్రబోస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబోస్ చేతుల విూదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు అని స్మరించుకున్నారు.