ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

చిత్తూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌ హరికృష్ణ స్థానిక నాయకులతో కలిసి పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు శుక్రవారం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి

డాక్టర్‌ నర్సింహులు, హరికృష్ణను కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను హరికృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన అన్ని బెడ్లు లేవని, ఆపరేషన్‌ థియేటర్‌ మూత పడిందని, సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆస్పత్రికి అదనంగా ఇంకొక డాక్టర్‌ అవసరమని, వెదురుకుప్పం మండలం రూరల్‌ ఏరియా కావడంతో వివిధ సమస్యలపై వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని డాక్టర్‌ నర్సింహులు తెలిపారు. ఆస్పత్రికి అదనపు గదులు అవసరమని, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ గా మార్చాలన్నారు. అదనంగా ఓటి కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ తో పాటు పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య అభివృద్ధి కమిటీ చైర్మన్‌ వి.ఈశ్వర్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగరాజా రెడ్డి, నాయకులు రామయ్య, వెంకటేశులు, శంకర్‌ రెడ్డి, విశ్వనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.