ఎన్నికలు అయ్యేవరకు నగదు బదిలీ ఆపండి: ఈసీ

ఢిల్లీ : ఎన్నికల నియమావళి అమలులో ఉండగా నగదు బదిలీ పథకం ప్రకటన పట్ల కేంద్రం ఇచ్చిన వివరణపై ఎన్నికలకమిషన్‌ సంతృప్తి చెందలేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కేంద్ర గౌరవించాలని పేర్కొన్న కమిషన్‌ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో శాసనసభ  ఎన్నికలు పూర్తయ్యేవరకు అక్కడ పథకం అమలు నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.