ఎన్నికల ఫలితాల వేళ లడ్డూలకు గిరాకీ

జీత్‌కే లడ్డూ పేరుతో స్వీట్‌ హౌజుల్లో తయారీ
న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడిరది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో భాగంగా మిఠాయిలు పంచుకోవడం మాములే. దీంతో విజయంపై ధీమాతో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో స్వీట్ల తయారీదారులకు చేతినిండా పని లభించింది. క్షణం తీరిక లేకుండా లడ్డూల తయారీలో సతమతమవుతున్నారు. వారు భారీ సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తున్నారు. దేశంలోని ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆయా రాష్టాల్లో మిఠాయిల దుకాణాలకు రాజకీయ పార్టీల నేతల నుంచి లడ్డూల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.ప్రజలు అసెంబ్లీ ఎన్నికల తీర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో పంజాబ్‌ స్వీట్‌ షాపులు లడూల ఆర్డర్‌లతో నిండిపోయాయి.లూథియానాలోని ఒక స్వీట్‌ షాప్‌ ఐదు కిలోల బరువున్న ’జీత్‌ కే లడ్డూస్‌’ పేరిట సిద్ధం చేసింది. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి గుర్తుగా ఈ సంవత్సరం మాకు లడ్డూల ఆర్డర్‌లు పెద్దమొత్తంలో వచ్చాయి. ప్రత్యేక లడ్డూల తయారీకి మేం శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాం’ అని పంజాబ్‌ హల్వాయి అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నరీందర్‌ సింగ్‌ చెప్పారు. లడ్డూలను తయారు చేసి, వాటిని ట్రేలలో ప్యాక్‌ చేయడంలో సిబ్బంది బిజీగా ఉన్నారు.ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎవరికి వారు తాము గెలుస్తామనే ధీమాతో స్వీట్‌ షాపులకు ముందుగానే లడ్డూలకు ఆర్డర్‌ ఇచ్చారు.