ఎన్‌సీసీ ఆధ్వర్యంలో 5కె రన్‌

గోదావరిఖని : వారోత్సవాలను పురస్కరించుకుని గోదావరి ప్రభుత్వ డిగ్రి కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. జ్యోతినగర్‌ మేడిపల్లి సెంటర్‌ నుంచి గోదావరిఖని గంగానగర్‌వరకు నిర్వహించిన 5కె రన్‌లో యువకులు పాల్గొన్నారు, ప్రిన్సిపాల్‌ రాజేంద్రన్‌ జెండా వూపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.