ఎఫ్‌డీఐలకు మేం వ్యతిరేకం : అరుణ్‌జైట్లీ

ఢిల్లీ : చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి మనదేశంలో సరికాదని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ అన్నారు. ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆరోపించారు. రాజ్యసభలో ఈ రోజు ఎఫ్‌డీఐల అనుమతి విషయంపై చర్చ జరుగుతున్న ఎన్‌సీపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని అన్నారు. ఓ వైపు మహారాష్ట్రలో వ్యతిరేకిస్తూ కేంద్రంలో మద్దతిస్తోందన్నారు.