ఎఫ్‌డీఐలపై 19 మంది సీఎంల ఆమోదం : ఆనంద్‌శర్మ

న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్‌ చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి పై నిర్ణయం తీసుకునే ముందు 14 మంది ముఖ్యమంత్రులతో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనద్‌శర్మ చెప్పారు. ఎఫ్‌డీఐల అంశంపై చర్చ అనంతరం మంత్రి రాజ్యసభలో సమాధానమిచ్చారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతిపై 19 మంది ముఖ్యమంత్రులు లిఖిత పూర్వక ఆమోదం తెలిపారని వెల్లడించారు. వ్యవసాయ  ఆధారిత రాష్ట్రాల్లో ఎఫ్‌డీఐలపై ఏకాభిప్రాయం ఉందని చెప్పారు.