ఎఫ్‌డీఐలు దేశ ప్రజలకు భారం :ఏచూరి సీతారాం

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల వల్ల దేశప్రజలకు నష్టమని సీపీఎం ఎంపీ ఏచూరి సీతారాం అన్నారు. చిల్లర వర్తకంలో విదేశి పెట్టుబడుల ఆహ్వానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ద్రవ్యలోటును అడ్డుకునేందుకు విదేశి పెట్టుబడులు రావాలనడం సరైందని కాదన్నారు. విదేశి పెట్టుబడుల కోసం దేశ ప్రజలపై భారం వేస్తారా అని రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.