ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై ఎటూతేల్చని ఎస్సీ, బీఎస్సీ

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ అనంతరం బుధవారం ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే కొన్ని పార్టీలు ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై తమ అభివప్రాయాన్ని చెప్పారు. ఎస్సీ,బీఎస్సీ మాత్రం ఓటింగ్‌పై ఇంకా తేల్చలేదు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా బీజేడీ ఎంపీలు లోక్‌సభలో ఓటు వేయనున్నారు. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా 261 మంది సభ్యలు ఉండగా, 219 మంది సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.