ఎఫ్‌డీఐల వల్ల దేశానికి తీరని నష్టం: ములాయం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐలను రిటైల్‌ రంగంలోకి అనుమతిస్తే దేశానికి తీరని నష్టమని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం వల్ల రైతులకు ఎలాంటి న్యాయం జరగదని ఆయన తెలిపారు. వీటివల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది తప్పా మరెలాంటి లాభం లేదని తెలిపారు.

గ్రామల గురించి పట్టించుకోవడం లేదు

ప్రభుత్వం కేవలం నగరాల గురించి మాత్రమే ఆలోచిస్తుందిగానీ, గ్రామాల గురించి పట్టించుకోవడం లేనది ములాయం ఆగ్రహం వ్యకత&ం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.