‘ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కైంది’

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది.చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు అరుణ్‌జైట్లీ ఎఫ్‌డీఐలపై సభలో  మాట్లాడారు.ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతి సరికాదన్నారు. ఎఫ్‌డీఐలపై ఎన్సీపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐల అనుమతిపై ఓ వైపు కేంద్రానికి మద్ధతిస్తూ, మహారాష్ట్రలో మాత్రం వ్యతిరేకిస్తోందని ఆయన తెలియజేశారు. ఎన్సీపీ విధానం సరిగా లేదని మండిపడ్డారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ విషయంలో యూపీఏ మెల్లగా గట్టెక్కిందని పేర్కొన్నారు.