ఎఫ్‌డీఐ, తుపాను నష్టాలపై చర్చకు తెదేపా నోటీసులు

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు అంశాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ తెదేపా స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసులు అందించింది. 193 నిబంధన కింద నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులకు జరిగిన నష్టాలపై, 184 నిబంధన కింద చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులు అంశాలపై చర్చకు అనుమతించాలని తెదేపా ఎంపీలు నామా నాగేశ్వరరావు, శివప్రసాద్‌, నిమ్మల కిష్టప్ప స్పీకర్‌ నోటీసులు అందించారు.