ఎఫ్‌డీఐ, ఫెమాపై ఓటింగ్‌తో కూడిన చర్చకు అనుమతి

ఢిల్లీ: ఎఫ్‌డీఐ, ఫెమాపై ఓటింగ్‌తో కూడిన చర్చకు లోక్‌సభలో స్పీకర్‌ అనుమతించారు. 184వ నిబంధన కింద చర్చ చేపట్టినందుకు ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు. విపక్షాలతో పాటు డీఎంకే, తృణమూల్‌ కూడా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్నాయని సుష్మ పేర్కొన్నారు.