ఎమ్మెల్యేను సన్మానించిన విఓఎలు

శ్రీకాకుళం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని గ్రామాల్లో ఉన్న విఒఎ లు స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ని సన్మానించారు. మంగళవారం ఎంపీడీఒ కార్యాలయం ఆవరణలో ఉన్న వెలుగు భవనంలో విఒఎ లు నిర్వహించిన అభినందన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిఎఫ్‌ లకు ప్రభుత్వం జీతం ఇస్తామన్న సందర్భంగా వారు క అతజ్ఞతతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర గ్రామ సమైక్య సభ్యురాలు పోషించారని చెప్పి ఆమెను అభినందించారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు నేర్పాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు.ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి విద్యాశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో జ్ఞానాన్ని పెంచే విధంగా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టాలని కోరారు.