ఎమ్మెల్యే బీమా భారతికి పుత్రశోకం

కుమారుడి అనుమనాస్పద మృతి

పాట్నా,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జనతా దళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) ఎమ్మెల్యే బీమా భారతి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె తనయుడి మృతదేహం ఓ రైల్వే ట్రాక్‌పై కనిపించింది. ఆయన మృతికి కారణాలేమిటో తెలియడం లేదు. దర్యాప్తు జరుగుతోంది.

ఇదిలావుండగా దీపక్‌ హత్యకు గురయ్యాడని బీమా భారతి, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీపక్‌ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తాను తన స్నేహితుడు ఇస్తున్న పార్టీకి వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపారు. ముసల్లాపూర్‌ హాత్‌ ఏరియాకు వెళ్తున్నట్లు చెప్పిన దీపక్‌ మృతదేహం నలంద మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ సవిూపంలోని రైల్వే ట్రాక్‌పై కనిపించడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీమా భారతి భర్త అవధేశ్‌ మండల్‌ కండలవీరుడు. ‘బాహుబలి’ రాజకీయనాయకుడిగా ఆయనకు పేరుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనపై నిషేధం అమలవుతోంది. అందుకేఆమె ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచారు.