ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

టేకులపల్లి, ఆగస్టు 3( జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించి తన స్వార్ధ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను బుధవారం మండల కేంద్రంలో దహనం చేశారు . ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి పైకి ఎదిగి ఈ రోజు తన స్వంత లాభం కోసం 21 వేల కోట్లకు అమ్ముడుపోయి ,కాంగ్రెస్ పార్టీ నీ రాజీనామా చేసిన మునుగోడు మాజీ కాంగ్రెస్ పార్టీ ఏమల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినీ ఆ ప్రాంత ప్రజలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ  కార్యక్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు లక్కినేని సురేందర్ రావు,భూక్యా దళ్ సింగ్ నాయక్,మండల ప్రెసిడెంట్ గుండా నరసింహ రావు, బాణోత్ సాములు నాయక్ ,ఏలూరి కోటేశ్వరరావు,డాక్టర్ రాంచందర్ నాయక్ ,ఈసం శ్రీనివాస్, ఎంపీటీసీ ఊకే రామకృష్ణ ,మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్య నాయక్,అర్జున్ రావు , ధారావత్ నాగేంద్ర బాబు , ఈసం చంటి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు భూక్య చంద్రకళ ,ఆకారపు స్వప్న తదితరులు పాల్గొన్నారు.