ఎమ్మెల్యే సహకారంతో కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి (

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  గత కొన్ని రోజుల నుంచి   చైతన్యపురి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్య  ఉందని   కాలనీ సభ్యులు కిషన్ , పవన్ ,సంతోష్ , లక్ష్మణ్ , పలువురు కాలనీ సభ్యులు చైతన్యపురి డివిజన్ గ్రూపులో పెట్టగానే  ఎమ్మెల్యే సుధీరన్న  ఆదేశాలతో, తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి (చందు )  వాటర్ వర్క్స్ మేనేజర్ హరిత మేడం తన దృష్టికి తీసుకువెళ్లగా    వెంటనే స్పందించిన ఆమె   మరుసటి రోజు నుంచే పనులు స్టార్ట్ చేసి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు పూర్తి   చేయడం జరిగింది.వర్క్ సమస్య పరిష్కరించిన  సందర్బంగా చందు కు కాలనీ సభ్యులు అభినందించడం జరిగింది..