ఎమ్మెల్సీ కవితను కలిసిన అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి..

ఫోటో రైటప్: ఎమ్మెల్సీ కవితను  మర్యాదపూర్వకంగా కలిసిన నల్ల భారతి..
వరంగల్ బ్యూరో: ఆగస్టు 26 (జనం సాక్షి)
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  రాష్ట్ర గౌరవ అధ్యక్షులు  రాంబాబు యాదవ్ , రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలో యూనియన్ రాష్ట్ర నాయకత్వం   నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను  హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
 శుక్రవారం కవిత నివాసంలో కలిసిన వారిలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాస కవి నిర్మల, ఉపాధ్యక్షులు  రమాదేవి, జంగం రాణి, సహాయ కార్యదర్శి  . కృష్ణకుమారి, రాష్ట్ర కోశాధికారి  వేదవతి,రాష్ట్ర నాయకులు నాగమణి,సంధ్య, రమ, రజిత కవిత, సునీత, విశ్వనిత, మమత, శారద,లక్ష్మి, ఇందిర, ప్రశాంతి,అనిత,కమల  అంగన్వాడీ నాయకులు పాల్గొన్నారు.