ఎర్రబెల్లికి 14రోజుల రిమాండ్

వరంగల్,  టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు జనగామ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం ఎర్రబెల్లిని జనగామ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు. మరోవైపు ఎర్రబెల్లి బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా పాలకుర్తిలో టీడీపీ-టీఆర్ఎస్ ఘర్షణ తర్వాత నిన్న ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ఎర్రబెల్లి గాయపడ్డారు.