ఎలిజబెత్‌కు జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు వార్షిక వేతనం 20శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్‌ పౌండ్లు, ఎలిజబెత్‌ (85) బ్రిటన్‌ రాణిగా గద్దెనెక్కి ఈనెలతో 60ఏళ్లు పూర్తవుతాయి. వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సమయంలోనే వేతనం కూడా పెరగడం విశేషం. ఆమె ఆస్తులు రికార్డు స్ధాయిలో 240.2 మిలియన్‌ పౌండ్ల లాభాలు అర్జించినట్లు క్రౌన్‌ ఎస్టేట్‌ సీఈ ఎలిసన్‌ నిమ్మో తెలిపారు.