ఎలక్ట్రిక్ పోల్పై రిపేర్ చేస్తూ..
ఝాన్సీ : ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. విద్యత్తు స్తంభంపై పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు షాక్ కొట్టింది. కరెంట్ పోల్పై మరమత్తు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. ఒకరు అక్కడికక్కడే చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్తు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తికి తొలుగు షాక్ కొట్టి మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన మరో వ్యక్తి కూడా షాక్కు లోనయ్యాడు. మొబైల్ వీడియోలో ఆ ఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించారు. సుమారు 11000 వోల్టేజీ ఉన్న ఎలక్ట్రిక్ లైన్పై రిపేర్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.