ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

టేకులపల్లి, ఆగస్టు 5( జనం సాక్షి ): మండల కేంద్రంలోని పి ఎం హెచ్ బాయ్స్ హాస్టల్ నందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టల్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు గూగులోత్ రామచందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1979 తర్వాత మళ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోబోతున్నామని, దేశ స్వతంత్రం కోసం, తెలంగాణ సాధన కోసం క్రియాశీలకంగా పని చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని దేశ ప్రధానులుగా రాష్ట్రపతిగా మహోన్నతమైన స్థానాలను అధిరోహించిన  వారిలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వహించిన వారేనని ఇలా ఎంతో మంది మేధావులు అందించిందని విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కారం మార్గం చూపిందని, అలాంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర  మూడో మహాసభలను విద్యార్థులు, మేధావులు, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కర్లపూడి సుందర్ పాల్,శ్రీరాములు మండల నాయకులు కెలోత్ నితిన్, భానోత్ యుగంధర్, భూరక శివరాజ్ ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area