ఏపీ గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌


` ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి
హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఈ నెల 15న నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్లు గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్టో ఎంటరాలజీ వైద్యులు స్పష్టం చేశారు. బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌.. ఏఐజీ ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విశ్వ భూషణ్‌ బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.