ఏపీ హోదా కోసం..
టవరెక్కిన తెలంగాణ యువకుడు
– ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉమేష్రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ, జులై27(జనం సాక్షి) : ఆంధప్రదేశ్కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో ఫైర్ సర్వీస్ కార్యాలయం వద్ద వరంగల్కు చెందిన యువకుడు ఉమేశ్రెడ్డి సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఆంధప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుందని, అందుకే ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఉమేష్ రెడ్డి అన్నాడు. గత కొంతకాలంగా ఏపీకి ¬దా కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తున్నానని, ఏపీకి అన్యాయం జరిగిందనే భావనతో కన్నాట్ ప్లేస్లోని సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టినట్లు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న ప్రధాని కార్యాలయ అధికారులు తనతో మాట్లాడారని పోలీసులకు చెప్పాడు. ఏపీకి ప్రత్యేక ¬దా కావాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని ఉమేష్ రెడ్డి స్పష్టం చేశాడు. తనకు కాంగ్రెస్ అంటే చాలా అభిమానమని, కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, ఏపీకి ప్రత్యేక ¬దా కూడా ఇస్తామని చెబుతోందని, కానీ ప్రస్తుతమున్న ప్రభుత్వం ¬దా ఇవ్వకుండా నాన్చుతోందని, అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ విధంగా సెల్ టవర్ ఎక్కానని పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు నచ్చజెప్పి టవర్ దింపే ప్రయత్నాలు చేశారు.