ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముక్తార్ పాషా మూడవ వర్ధంతి సభను జయప్రదం చేయండి

ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముక్తార్ పాషా మూడవ వర్ధంతి సభను జయప్రదం చేయండి

 

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23(జనం సాక్షి)ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముక్తార్ పాషా మూడవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ నగరంలోని రంగసాయిపేట క్రాస్ జంక్షన్ లో ప్రజా సంఘాల నాయకులు పోస్టర్ ఆవిష్కరించారుకామ్రేడ్ ముక్తార్ పాషా గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వ్యాధికి గురై , మరణించారని ఆయన సంస్మరణ సభ ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు రోడ్ లో ఏఎస్ఎం కాలేజ్ దగ్గర్లో ఉన్న అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని వారు తెలిపారు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారని ఈ సభను జయప్రదం చేయాలని వివిధ వర్గాల ప్రజలను వారు కోరారుఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ఐ ఎఫ్ టి యు నగర అధ్యక్షులు బన్న నర్సింగం ఉపాధ్యక్షులు ఎర్రజయబాబు ఇనుముల కృష్ణ సాంబయ్య హరిబాబు ఎండి అక్బర్ బండి చంద్రమౌళి లతోపాటు కార్మికులు పాల్గొన్నారు