ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతాలు

అశ్వరావుపేట, అక్టోబర్ 20( జనం సాక్షి ) మండలంలోని అనంతారంలో గురువారం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అశ్వరావుపేట ఐ సిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రోజా రాణి ఆధ్వర్యంలో అనంతారం గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి పసుపు, కుంకుమ పూలు పళ్ళు తో వడి లను నింపారు. అనంతరం అక్షంతతో దీవించారు. ఈ సందర్బంగా సీడీపీఓ రోజారాణి మాట్లాడుతూ వైద్యుని సలహాల మేరకు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సౌజన్య, అంగన్వాడీ టీచర్లు కల్పన, సత్యవతి, ప్రమీల, ఆదిలక్ష్మి, రాములమ్మ,ఆశా కార్యకర్తలు శ్రీదేవి, ఏఎన్ఎం విజయ కుమారి, దుర్గ, ఈవో రాజకుమారి, ఎంపీటీసీ పి కుమారి, తదితరులు పాల్గొన్నారు.