ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

ఏలూరు,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. అనంతరం ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది. కాగా… తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం, తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడం పట్ల అటు వైద్యులు, ఇటు ఆ మహిళ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.